- లగ్జరీ లైఫ్కు అలవాటు పడి సేల్స్.. డ్రగ్స్ పెడ్లర్లుగా అవతారం
- డార్క్వెబ్లో ఆర్డర్లు ఇచ్చి కొరియర్లో తెప్పిస్తున్న జంట
- ఈవెంట్మేనేజర్, డెలివరీ బాయ్తోసహా నలుగురు అరెస్ట్
- రూ.4 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్లో డ్రగ్స్ నెట్ వర్క్ గుట్టు రట్టయింది. బాయ్ ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్న యువతితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ఎంప్లాయీస్ను లక్ష్యంగా చేసుకుని బాయ్ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్దందా చేస్తున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ఇంజినీర్తోపాటు మరో ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ఎన్ఈడబ్ల్యూ) పట్టుకున్నది.
వీరి నుంచి రూ. 4 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాస్ట్, ఓజీ కుష్ తోపాటు రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులతో కలిసి వీరు జాయింట్ఆపరేషన్చేశారు. ఏపీలోని కాకినాడకు చెందిన ఉమ్మిడి ఇమ్మాన్యుయెల్ (25) కొండాపూర్లో ఉంటూఈవెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన చోదవరపు సుస్మిత అలియాస్లిల్లీ ఇమ్మాన్యుయెల్తో సహజీవనం చేస్తున్నది.
ఈమె ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేరింది. కొంతకాలం కింద ఇమ్మాన్యుయెల్ డ్రగ్స్వాడేవాడు. తర్వాత డ్రగ్స్బిజినెస్చేసి సంపాదించి ఆ డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. డ్రగ్స్పెడ్లర్గా మారితే ఎక్కువ డబ్బులు వస్తాయని దందాలోకి దిగాడు. ఇతడిపై మన రాష్ట్రంతో పాటు ఏపీలోనూ ఎన్డీపీఎస్ కేసులున్నాయి. లగ్జరీ జీవన శైలికి అలవాటు పడిన సుస్మిత తన బాయ్ ఫ్రెండ్ ఇమ్మాన్యుయెల్తో కలిసి యువతను టార్గెట్ చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నది.
డార్క్వెబ్ద్వారా ఆర్డర్.. కొరియర్తో డెలివరీ
ఇమ్మాన్యుయెల్ డార్క్ వెబ్ ద్వారా టార్ బ్రౌజర్ ఉపయోగించి డ్రగ్స్ కొనేవాడు. చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ ద్వారా జరిపేవాడు. ఈ డ్రగ్స్డీటీడీసీ, పోస్టల్ద్వారా వచ్చేవి. ఇమ్మాన్యుయెల్ లేనప్పుడు సుస్మిత ఈ దందా నడిపించేది. వచ్చిన డబ్బులు, పోయిన డబ్బుల లెక్కలన్నీ సుస్మిత చూసేది. వీరికి ఆర్డర్వచ్చిన తర్వాత రాపిడో, స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేసే కాకినాడకు చెందిన సాయికుమార్ (28) డ్రగ్స్చేరవేసేవాడు.
దీని కోసం అతడు డెడ్-డ్రాప్ పద్ధతి ( నో కాంటాక్ట్) అనుసరించేవాడు. అంటే ఆర్డర్వచ్చాక డ్రగ్స్ను ఎక్కడో ఒక చోట పెట్టి ఆ విషయాన్ని యూజర్స్కు చేరవేసేవాడు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి హోమ్ డెలివరీ చేసేవారని కూడా తెలిసింది. వీరి గురించి తెలుసుకున్న హెచ్న్యూ, స్థానిక పోలీసులతో కలిసి రైడ్స్నిర్వహించింది.
నిందితుల నుంచి 22 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి (ఓజీ), 5 గ్రాముల ఎండీఎంఏ, 5.57 గ్రాముల ఎక్స్టసీ పిల్స్, 6 ఎల్ఎస్డీ బ్లాట్స్, 4 మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులతో డ్రగ్స్వాడుతున్న చిక్కడపల్లికి చెందిన తలబట్టుల తారక లక్ష్మీకాంత్ అయ్యప్ప (24)ను అరెస్ట్చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన డీలర్లు ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఐ ఎస్. బాలస్వామి, ఎస్ఐ పి.అభిలాష్ పాల్గొన్నారు. డ్రగ్స్గురించి సమాచారం తెలిస్తే 8712661601 నంబర్కు తెలియజేయాలని కోరారు.
డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న విదేశీ మహిళలు అరెస్ట్
మెహిదీపట్నం: నగరంలో డ్రగ్స్సప్లయ్చేస్తున్న ఇద్దరు విదేశీ మహిళలను మసాబ్ ట్యాంక్ పోలీసులు అరెస్టు చేశారు. జాంబియాకు చెందిన ఎమెలీ ములిండే అలియాస్ క్యాథీ హంచబిలా (29), మలావికి చెందిన ఎలెనా కసకతిరా (48) ముంబైలో ఉంటున్నారు. ఓ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న బంజారా హిల్స్లోని జీవీకే మాల్ వెనుక 43.7 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏను డెలివరీ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ నెల 18న డ్రగ్స్స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరి గురించి తెలియడంతో వారిపై నిఘా పెట్టారు. వారు ముంబైకి పారిపోయే యత్నం చేస్తుండగా బుధవారం పట్టుకున్నారు. రెండున్నర లక్షల నగదు, నకిలీ పాస్పోర్ట్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
