పెళ్లింట విషాదం: వరుడు సహా ముగ్గురి మృతి

పెళ్లింట విషాదం: వరుడు సహా ముగ్గురి మృతి

పెళ్లింట విషాదం నెలకొంది. కరెంటు షాక్ కు గురై పెండ్లి కొడుకుతో సహా మరో ముగ్గురు చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, ముక్తాపురం గ్రామానికి చెందిన ప్రవీన్(25) కు ఈనెల 19వ తేదీన పెండ్లి జరిగింది. ఇంటిముందు వేసిన పెళ్లి పందిరికి ఎలక్ట్రిక్ బల్బులతో డెకరేట్ చేశారు. అది పక్కనే ఉన్న ఇనుప దండెంకు ఆనుకుంది. శుక్రవారం పెండ్లికొడుకు తల్లి లక్ష్మమ్మ ఉతికిన బట్టలను దండెం పై ఆరేసింది. దీంతో ఆమెకు కరెంట్ షాక్ తగిలింది. లక్ష్మమ్మను రక్షించేందుకు వెళ్లిన ప్రవీన్, అతని తండ్రి సాయిలు, మేనత్త గంగమ్మ కు కూడా కరెంట్ షాక్ కు గురయ్యారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.