పారిపోయిన పెళ్లికొడుకు వచ్చిండు

పారిపోయిన పెళ్లికొడుకు వచ్చిండు

సంగారెడ్డి, వెలుగు: రూ. 25 లక్షల క్యాష్, 25 తులాల బంగారంతో ఉడాయించిన పెళ్లికొడుకు తప్పు తెలుసుకొని వచ్చిండు. మనసు మార్చుకుని ఆ పిల్లనే పెళ్లి చేసుకుండు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహం నిశ్చయమైంది. కొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరకట్నంగా ఇచ్చిన రూ.25 లక్షల నగదు, 25 తులాల గోల్డ్ తో వరుడు ఎస్కేప్ అయ్యాడు. దాంతో వివాహం ఆగిపోయింది. పారిపోయిన మాణిక్ రెడ్డి తన తప్పు తెలుసుకుని పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. కుటుంబసభ్యులు, పోలీసులు, స్థానిక లీడర్లు వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం పోతిరెడ్డిపల్లిలోని శివాలయంలో వేద పండితుల మధ్య వధూవరులకు పెళ్లి జరిపించారు.