
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ కార్నర్ మీటింగ్ వర్క్షాప్లో పాల్గొన్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయమే రూ. 40వేల కోట్లు వస్తుంటే.. కేసీఆర్ సంక్షేమ పథకాలకు కనీసం రూ.230వేల కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండి సూచించారు. పార్టీని సంస్థాగతంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్నర్ మీటింగ్ ల ద్వారా ఇంటింటికీ బీజేపీని చేరువ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర బడ్జెట్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నార బండి సంజయ్ అన్నారు. రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం 1.30 లక్షల కోట్లు అని చూపడం విడ్డూరంగా ఉందన్నారు. మిగిలిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. లిక్కర్ అమ్మకాలు, భూముల విక్రయాలు, పన్నులు, ఛార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలనుకుంటోందని బండి విమర్శించారు.