క‌రోనా సంక్షోభం : 36 వేల మంది ఉద్యోగుల‌పై స‌స్పెన్ష‌న్‌

క‌రోనా సంక్షోభం : 36 వేల మంది ఉద్యోగుల‌పై స‌స్పెన్ష‌న్‌

క‌రోనా సంక్షోభం వ‌ల్ల విమానాల రాక పోక‌లు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచి పోయిన విష‌యం తెలిసిందే. దీంతో భారీ న‌ష్టాల పాల‌వుతున్న ఏయిర్ వేస్ ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బ్రిటీష్ ఎయిర్‌వేస్ భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తాత్కాలికంగా తొల‌గించ‌నుంద‌ట‌. ఆల్మోస్ట్ 36 వేల మంది ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆ సంస్థ భావిస్తున్నట్లు స‌మాచారం. దీనిపై ఆ కంపెనీ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డించ‌నుంద‌ట‌.

క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఆ కంపెనీకి చెందిన దాదాపు అన్ని విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. ఈ క్ర‌మంలో యునైట్ యూనియ‌న్ తో బ్రిటీష్ ఎయిర్ వేస్ ఓ ఒప్పందం కుద‌ర్చుకోనుంద‌ట‌. బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్‌, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో ప‌నిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు విధుల నుంచి స‌స్పెండ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయట‌. ఎయిర్ వేస్ నిర్ణ‌యం వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోయేవారు.. ప్ర‌భుత్వ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొంద‌నుండ‌గా.. వారికి నెల‌కు 2500 పౌండ్లు ఇవ్వ‌నున్నారట‌.