చెన్నారావుపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

చెన్నారావుపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
  • కుర్చీలతో కొట్టుకున్నారు!
  • చెన్నారావుపేట సర్పంచ్ ​ప్రమాణస్వీకారంలో ఘటన

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్​బలపర్చిన కంది శ్వేత సర్పంచ్​గా,  కాంగ్రెస్​మద్దతుతో  దొంతి శ్రీనివాస్​ఉప సర్పంచ్​గా ఎన్నికయ్యారు. సోమవారం  పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

 సర్పంచ్​మద్దతుదారులు డీజేలో కేసీఆర్​పాటలు పెట్టుకుంటూ  పంచాయతీ ఆఫీసుకు తరలివచ్చారు. కేసీఆర్​పాటలు పెట్టడం సరికాదని కాంగ్రెస్​కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వివాదం ముదిరి వేదిక వద్ద ఇరువర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు.  కాంగ్రెస్​నేత వనపర్తి శోభన్​, బీఆర్​ఎస్​నేత రమేష్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి ఇద్దరిని చికిత్సకోసం నర్సంపేట జనరల్​ఆస్పత్రికి తరలించారు. 

ఎస్ఐ రాజేష్​రెడ్డి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎంపీడీవో శివానంద్​ కొత్త పంచాయతీ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.