బీఆర్ఎస్, బీజేపీ దోస్తులే : మంత్రి పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్, బీజేపీ దోస్తులే : మంత్రి పొన్నం ప్రభాకర్

 బీఆర్ఎస్, బీజేపీ దోస్తులనే విషయం ఈ రోజు స్పష్టమైందని, శాసన సభ అనుమతితో ఏర్పాటు చేసిన మేడిగడ్డ పరిశీలనకు ఈ రెండు పార్టీలు రాకపోవడమే ఇందుకు నిదర్శనమని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాజెక్ట అవినీతిపై కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అయ్యారని అన్నారు. కేంద్రం ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని నిలదీశారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని, కాదని చెప్పే ధైర్యం వాళ్లకు ఉందా? అని సవాల్ విసిరారు.