
- ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారంటూ ప్రశ్నలు
- సానుభూతి వర్కవుట్అవుతుందా? లేదా అనే అనుమానంతోనే..
- కంటోన్మెంట్లో వ్యూహం బెడిసి కొట్టడంతో ముందుచూపు
- అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నిక ఫలితాలు రిపీట్ కాకూడదనే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్..పార్లమెంట్ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేక అప్రతిష్ట మూటగట్టుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా గులాబీ నేతలు జూబ్లీహిల్స్లో ఒక రహస్య సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం.
ఎవరికి ఓటేస్తారు?
‘ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీఆర్ఎస్అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్భార్య సునీతకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా?’ అన్న విషయాలు తెలుసుకోవడానికి బీఆర్ఎస్ ఈ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. సానుభూతి ఓట్లు పడతాయో లేదా అన్న అనుమానం ఉండడంతోనే పార్టీ ఈ సర్వే చేయిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు లీడర్లు చెప్తున్నారు. ఎందుకంటే, ఇంతకు ముందు కంటోన్మెంట్ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయినప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించగా, సానుభూతి వర్కవుట్అవుతుందని ఆమె సోదరికి టికెట్ఇచ్చారు. కానీ, ఆ ఎలక్షన్లలో బీఆర్ఎస్వ్యూహం బెడిసికొట్టి కాంగ్రెస్నుంచి పోటీ చేసిన శ్రీగణేశ్విజయం సాధించారు. జూబ్లీహిల్స్విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమైతే భవిష్యత్అంధకారమవుతుందేమోనని ఆ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే సర్వే చేసి వచ్చే రిపోర్ట్ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అదృష్టం దక్కుతుందేమోనని...
పార్టీ ఒకవైపు సర్వే చేయిస్తూ ఓటరు నాడి తెలుసుకునేందుకు సర్వే చేయిస్తుంటే ఆ పార్టీ ఆశావహులు టికెట్కోసం పట్టువీడని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ సర్వేలో సానుభూతి వర్కువుట్కాదని తేలితే తమకు టికెట్దక్కవచ్చేమోనని అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఒకరు. దివంగత పీజేఆర్కొడుకు అయిన విష్ణువర్ధన్రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్టికెట్ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. మాగంటి మరణంతో ఉప ఎన్నికలు రావడంతో ఈసారి తాను పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్కు చెప్పినట్టు సమాచారం.
అలాగే, గత ఎన్నికల్లో టికెట్కోసం యత్నించి విఫలమైన రావుల శ్రీధర్రెడ్డి కూడా ఈసారైనా తనకు ఛాన్స్ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా తన కొడుకు సాయికిరణ్యాదవ్కు టికెట్ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. సాయికిరణ్గతంలో సికింద్రాబాద్ఎంపీ స్థానానికి బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తనకు జూబ్లీహిల్స్నియోజక వర్గం సుపరిచితమేనని, తన బంధుగణం ఇక్కడ కీలకంగా ఉన్నారని, తన సామాజిక వర్గానికి చెందిన వారు 25వేల మంది వరకు ఓటర్లున్నారని, టికెట్ఇస్తే గెలిచి చూపిస్తానని ఆయన పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్లో కమ్మ సామాజిక వర్గానికి 25 వేల పైచిలుకు ఓట్లుండడంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ను పోటీకి దింపుతారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఆయన స్థానికేతరుడని, ఆయనను పోటీలో పెడితే ఓడిపోవడం ఖాయమని, స్థానికులైన వారు రెబల్గా పోటీ చేసే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది.
మజ్లిస్ అండ లేకపోయినా గెలుస్తమా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్పార్టీ బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేలా స్నేహపూర్వకంగా పోటీ చేసి పరోక్షంగా గులాబీ అభ్యర్థి గెలుపునకు కారణమైంది. మైనారిటీల ఓట్లు చీలడంతో కాంగ్రెస్కు నష్టం జరిగి ఓడిపోయింది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్అధికారంలోకి రావడం, గత ఎన్నికల ముందు బీఆర్ఎస్మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్..ఈసారి కాంగ్రెస్తో దోస్తీ చేస్తుండడం బీఆర్ఎస్కు మింగుడు పడని అంశంగా మారింది. దీంతో సానుభూతి వర్కవుట్ అవుతుందా? లేక మజ్లిస్మద్దతుతో వేసే ఓట్లు ప్రభావం చూపిస్తాయా అన్నది తేల్చుకోవడానికి కూడా పార్టీ సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. సర్వేలో వచ్చే ఫలితాల ఆధారంగానే బీఆర్ఎస్తమ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశముందని ఆపార్టీలోని ముఖ్యనాయకుడొకరు తెలిపారు.