హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్సోమవారమే రిలీజ్కానుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్మీట్పెట్టి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్లక్కీ నంబర్అయిన ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ఉంటుందని చెప్తున్నారు. ముహూర్తం కూడా మధ్యాహ్నం12.03 గంటలకు ఖరారు చేశారని సమాచారం. 90 మందికి పైగా అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశముంది.
2018 సెప్టెంబర్6న అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత105 మందితో కేసీఆర్ ఫస్ట్లిస్ట్ ప్రకటించారు. అప్పుడు మొత్తంగా ఏడుగురు సిట్టింగ్ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానాల్లో కొత్త వారికి చాన్స్ఇచ్చారు. ఈ సారి 9 నుంచి 13 మంది సిట్టింగులను తప్పించే అవకాశముందని చెప్తున్నారు. ఇందులో సగానికి పైగా స్థానాలకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం. అభ్యర్థుల ప్రకటనతో పాటు రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీని ఎందుకు గెలిపించాలో ప్రెస్మీట్లో కేసీఆర్ వివరించనున్నారు. పార్టీ మేనిఫెస్టో కమిటీని సైతం ప్రకటించనున్నారని తెలిసింది. పార్టీ సెక్రటరీ జనరల్కె. కేశవరావు, సీనియర్నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులతో మేనిఫెస్టో కమిటీ ఉంటుందని చెప్తున్నారు.