
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పి్ంది. రైతుల పంట రుణాల మాఫీ కోసం మరో రూ. 1000 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన వెయ్యి కోట్లతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 21.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండో విడత రుణమాఫీని 2023 ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది.
మొత్తం 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న ఒకే రోజు రూ.5 వేల 809 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. 9 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేసింది.
ఇప్పటి వరకు 1.20 లక్షల రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రూ.99,999 రుణానిన్న మాఫీ చేయగా.. రాబోయే రోజుల్లో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ చేయనున్నది.