పట్టుబడిన ఉగ్రవాది ఓవైసీ కాలేజీలో హెచ్వోడీ ఉగ్రవాదులకు ఎంఐఎం ఆశ్రయం ఇస్తోంది

 పట్టుబడిన ఉగ్రవాది ఓవైసీ కాలేజీలో హెచ్వోడీ  ఉగ్రవాదులకు ఎంఐఎం ఆశ్రయం ఇస్తోంది

ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో ఉగ్రవాదులకు సపోర్ట్గా ఓ వైసీ మాట్లాడారని గుర్తు చేశారు. పాతబస్తీలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని..ఇందులో ఓ వ్యక్తి ఓవైసీ చెందిన కాలేజీలో హెచ్ వోడీగా పనిచేస్తున్నాడని చెప్పారు. 

రాజకీయాల కోసం ఉగ్రవాద సంస్థలను ఎంఐఎం వాడుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ వాడుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు అధికారమే కావాలని.....ప్రజల భద్రత అవసరం లేదన్నారు. హైదరాబాద్ లోని ప్రజల ప్రాణాలు బాంబుల మీదున్నాయని..హైదరాబాద్ ప్రజల భద్రతను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.