బీఆర్ఎస్​ మనుగడ కోల్పోతోంది : షబ్బీర్​అలీ

బీఆర్ఎస్​ మనుగడ కోల్పోతోంది :  షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో బీఆర్ఎస్​ పార్టీ మనుగడ కోల్పోతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.  శుక్రవారం కామారెడ్డి మున్సిపల్​ వైస్​ చైర్​పర్సన్​గా ఉరుదొండ వనిత ఎన్నికైన తర్వాత మర్యాద పూర్వకంగా ఆమె షబ్బీర్​అలీని కలిశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీ ర్​అలీ మాట్లాడుతూ గతంలో  బీఆర్​ఎస్​ పార్టీ మున్సిపల్​చైర్మన్​ పదవిని దుర్వినియోగం చేసిందని గుర్తుచేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అవినీతి రహిత పాలన అందిస్తోందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్​కాంగ్రెస్​పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాసంగి సీజన్​లో రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం అమ్మిన 94 శాతం మంది రైతుల అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయని చెప్పారు. విత్తనాలు లేవంటూ అబద్ధపు ప్రచారం చేయడం తగదన్నారు. అనంతరం ఉరుదొండ వనితను షబ్బీర్​అలీ
 సన్మానించారు.