మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్

మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్  భాస్కర్

బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లే నాయకులపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫోటోతో గెలిచిన నాయకులు ఇప్పుడు పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్టీ మారిన నాయకులతో క్యాడర్ పోవట్లేదని చెప్పారు. పచ్చని చెట్టుకు ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు పోతున్నారని అన్నారు. మళ్ళీ చెట్టు చిగురిస్తుంది, కాయలు కాస్తాయని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎండి పోయిన పొలాలు, కాలిపోతున్న మోటార్లు కనిపిస్తున్నాయని వినయ్ ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. రాష్ట్రంలోని చోటా భాయ్, కేంద్రంలోని బడా భాయ్ కలిసి కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఫుల్ టైం పొలిటీషియన్ అని తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. పార్ట్ టైం పొలిటీషియన్ లు పార్టీ మారిన వచ్చే నష్టం ఏం లేదని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.