- డిసెంబర్9 విజయ్దివస్.. 23 విద్రోహ దినమని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘‘తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నాడు నవంబర్29న కేసీఆర్చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది. కేసీఆర్ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్9న ప్రకటన వచ్చేది కాదు. జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు” అని వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించిన సోనియా గాంధీ.. ఆ తర్వాత ఆంధ్రోళ్ల ఒత్తిళ్లకు తలొగ్గి డిసెంబర్23న ప్రకటనను వెనక్కు తీసుకున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9న విజయ్ దివస్ ఎట్లాగో.. అట్లాగే డిసెంబర్ 23ను విద్రోహ దినంగా ప్రకటించాలని డిమాండ్చేశారు. మంగళవారం తెలంంగాణ భవన్లో విజయ్దివస్కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని పేర్కొన్నారు.
‘‘కేసీఆర్అంటే పోరాటం, త్యాగం. రేవంత్రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం. ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయాలని అడిగితే.. జిరాక్స్పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల పైకి రైఫిల్పట్టుకుపోయిన చరిత్ర ఆయనది’’ అని మండిపడ్డారు. దీక్ష, పోరాటాల వల్ల కేసీఆర్ఆయుష్షు పదేండ్లు తగ్గిపోయిందన్నారు. ‘‘కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. దేవుడి దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఆయనఆరోగ్యంగా ఉన్నారు. ప్రజల తరఫున మళ్లీ పోరాటం చేస్తారు.. సీఎం అవుతారు” అని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్పెట్టింది నకిలీ తెలంగాణ తల్లి..
తెలంగాణ తల్లి ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపమని హరీశ్రావు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా విగ్రహాలు పెట్టుకుని పూజించుకున్న తల్లిని.. రేవంత్మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని ఫైర్ అయ్యారు. రేవంత్సృష్టించింది నకిలీ తెలంగాణ తల్లి అని, ఆ తల్లి చేతిలో నుంచి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

