జాగృతికి అనుబంధంగా ఫూలే ఫ్రంట్​..కలిసి పనిచేస్తామని ప్రకటించిన కల్వకుంట్ల కవిత

జాగృతికి అనుబంధంగా ఫూలే ఫ్రంట్​..కలిసి పనిచేస్తామని ప్రకటించిన కల్వకుంట్ల కవిత
  • ఫ్రంట్​కు కొత్త కార్యవర్గం ప్రకటన
  • కన్వీనర్​గా బొల్లా శివశంకర్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతికి అనుబంధ సంస్థగా యునైటెడ్​ ఫూలే ఫ్రంట్​(యూపీఎఫ్​) పనిచేస్తుందని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేంత వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్​ ఉద్యమిస్తాయని చెప్పారు. ఆదివారం హైదరాబాద్​లోని జాగృతి ఆఫీసులో యూపీఎఫ్​ నాయకులతో కవిత సమావేశమయ్యారు.

యూపీఎఫ్​ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫ్రంట్​ కన్వీనర్​గా బొల్లా శివశంకర్​, కో ఆర్డినేటర్​గా ఆలకుంట హరి, అడ్వైజర్​గా గట్టు రామచందర్​రావుతో పాటు మరో 50 మందిని కోకన్వీనర్లుగా నియమించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐక్య పోరాటాలతోనే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టిందని చెప్పారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్​ సర్కారు కూడబలుక్కొని బీసీ బిల్లులను కోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీలో పెట్టే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే బీసీ బిల్లులకు చట్టబద్ధతను తీసుకొచ్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కాగా, బీసీల రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా జాగృతితో కలిసి పనిచేస్తామని యూపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొల్లా శివశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నారు. 

ఆ టెండర్లను రద్దు చేయాలి 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని  కవిత డిమాండ్​ చేశారు. వార్డులవారీగా మళ్లీ కొత్త టెండర్లు పిలవాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డికి కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజిన్లలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ కు సంబంధించిన పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకు నష్టం కలుగుతున్నదని ఆరోపించారు.

మాన్​సూన్​ రిపేర్లకు సంబంధించిన పనులను చేసేందుకు వాడే వెహికల్స్​కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు పెట్టారని, వాటిని అమ్మే డీలర్లు హైదరాబాద్​లో ఇద్దరే ఉన్నారని చెప్పారు. టెండర్లలో పాల్గొన్న స్థానిక కాంట్రాక్టర్లకు ఆయా డీలర్లు వాహనాలు సరఫరా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో.. స్థానిక కాంట్రాక్టర్లు కర్నాటక డీలర్లతో ఎంవోయూ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. వాటి ఫిజికల్ కాపీలు సమర్పించేందుకు జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు తగినంత సమయం కూడా ఇవ్వడం లేదని చెప్పారు.

మెడపైన కత్తిపెట్టి కొన్ని గంటల్లోనే కాపీలు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీలు సమర్పించలేదనే సాకు చూపించి స్థానిక కాంట్రాక్టర్లను టెండర్లలో డిస్ క్వాలిఫై చేశారన్నారు. జీహెచ్ఎంసీ ముందే ఒప్పందం చేసుకున్న 2  సంస్థలకు లబ్ధి చేసేలా కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 150 డివిజన్లకు సంబంధించి కేవలం 9 టెండర్లే పిలిచారని చెప్పారు. అలాకాకుండా వార్డులవారీగా టెండర్లు పిలిస్తే.. 150 డివిజన్లలో 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి కలుగుతుందని తెలిపారు.