- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీని డిబేట్కు పిలిచి ఓ చానెల్అవమానించడం దారుణమని, చానెల్ తీరును ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై కుట్ర పూరితంగా డిబేట్ హోస్ట్ వ్యవహరించారని..దాన్ని ఎమ్మెల్సీ రవీందర్ రావు అడ్డుకోవడంతోనే హోస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు. ఈ వ్యవహారంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఆ చానెల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది రవీందర్ రావుపై జరిగిన దాడి కాకుండా మండలి సభ్యుల మీద జరిగిన దాడిగా భావించి చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్ను కోరామని మధుసూదనా చారి వెల్లడించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ..చానెల్ డిబేట్లో జరగనివి జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు యాంకర్ తనపై అనుచిత కామెంట్లు చేశారని తెలిపారు.
పిచ్చిరాతలు, విషప్రచారం చేసే వారిపట్ల తాను డిబేట్లో మాట్లాడనని, గెస్ట్గా పిలిచి అవమానించడం కలచివేసిందని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న చానెల్స్పై, పత్రికలను ఉద్దేశించి మాత్రమే రవీందర్ రావు మాట్లాడారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. అందుకు ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడం దారుణమని తెలిపారు. గెట్అవుట్అనడం దురహంకారమేనని శ్రీనివాస్ పేర్కొన్నారు.
