- మన బలమెంత..వారి బలమెంత ?
- పథకాలు అందాయా? ఇంకేం కావాలి?
- వివరాలు రాబట్టేందుకు సర్వేలు చేయిస్తున్న ఎమ్మెల్యేలు
- ప్రతి నియోజకవర్గంలో వంద ఓటర్లకు ఒక ఇన్ఛార్జి
- ఆపై డివిజన్అధ్యక్షులు, లీడర్లకు బాధ్యతలు
- వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసం ప్లాన్లు
హనుమకొండ, వెలుగు: అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఎన్నికల గుబులు పట్టుకుంది. ఈ ఏడాదిలోనే ఎలక్షన్లు జరగనుండటంతో సిట్టింగ్ఎమ్మెల్యేలు జనం పల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు. ఓటర్లకు బీఆర్ఎస్పార్టీ ద్వారా అందిన పథకాలు, ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా నియోజకవర్గాల్లో తమ బలం..ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న వారి బలం అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో తమ పార్టీ లీడర్లను రంగంలోకి దించి సర్వేలు చేయిస్తున్నారు. ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్ ఛార్జీని నియమించారు. ఇదంతా చూసుకోవడానికి గ్రామ, డివిజన్శాఖ అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. వారు ఫీల్డ్లెవెల్లో వివరాలు సేకరించి ఎమ్మెల్యేలకు అందజేస్తే.. ఆయా రిపోర్టుల ప్రకారం ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్లాలో కసరత్తు చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్హై కమాండ్ఈసారి టికెట్ కట్చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో.. తమ బలాన్ని చూపించుకునేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఆ మూడు ఎన్నికల లెక్కనే..
బీఆర్ఎస్ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్, మునుగోడు ఎలక్షన్లలో మాదిరిగానే నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు సర్వే చేయించుకుంటున్నారు. హుజూరాబాద్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించేందుకు సీఎం కేసీఆర్..మంత్రి హరీశ్రావు, ప్లానింగ్ బోర్డు వైస్చైర్మన్బోయినపల్లి వినోద్కుమార్లకు ఎన్నికల ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు గ్రౌండ్లెవెల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకుని, ముందుకు వెళ్లేందుకు ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జీని నియమించారు. తర్వాత మండలానికో మంత్రి, ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించి ఎలక్షన్ వరకు అక్కడే క్యాంపెయిన్నిర్వహించారు. ఇదే పద్ధతిని మునుగోడులోనూ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కూడా ఇట్లాగే చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి వంద మంది ఓటర్లను ఒక క్లస్టర్గా విభజించి, ఒక ఇన్ఛార్జీని నియమించారు. వారిపై బూత్కమిటీలు, పార్టీ గ్రామ, డివిజన్ శాఖ అధ్యక్షులు, సీనియర్లీడర్లకు బాధ్యతలు అప్పగించారు. ఫీల్డ్లో సర్వే చేసేందుకు ప్రత్యేక ప్రొఫార్మా సిద్ధం చేశారు. నియోజకవర్గస్థాయి లీడర్లతో పాటు మున్సిపల్కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, గ్రామ, డివిజన్అధ్యక్షులతో మీటింగ్నిర్వహించారు. వారికి ప్రొఫార్మా కాపీలు అందజేశారు. ఈ కాపీలతో పాటు ఓటర్ల జాబితా తీసుకున్న వంద ఓట్ల ఇన్ఛార్జీలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఏమేం పథకాలు అందుతున్నయ్?
పార్టీ నుంచి ప్రజలకు అందుతున్న పథకాలతో పాటు జనాలు ఎక్కువగా ఏ పార్టీ వైపు ఉన్నారో తెలుసుకునేలా ఈ సర్వేను ప్లాన్చేశారు. ‘వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటర్నంబర్, ఇంటి నంబర్, ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, కులం, సెల్ఫోన్నంబర్, ఓటరుకు అందుతున్న పథకాలు, ఏం పథకాలు కావాలి’ అని అడుగుతూ వివరాలు రాబడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందారో తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఇంతవరకు ఎలాంటి పథకాన్ని తీసుకోని వారు ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రైతుబంధు, దళితబంధు ఇలా వివిధ పథకాల పేర్లు చెప్పి.. ఓటరుకు ఏమేం కావాలో అడిగి రాసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎందుకిదంతా అని ప్రశ్నిస్తున్న ఓటర్లకు ‘ఓటరు కోరుకునే సంక్షేమ పథకాలు అందించేందుకే రిపోర్ట్ తయారు చేస్తున్నాం’ అని సమాధానమిస్తున్నారు. ఇంతేగాకుండా సదరు ఓటరు ఏ పార్టీకి చెందినవాడు? ఏమైనా రిమార్క్స్ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక కాలమ్స్మెన్షన్ చేశారు. ఆయన ఉంటున్న పార్టీలో ఎలా పని చేస్తాడు? ప్రవర్తన ఎలా ఉంటుంది? వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ సదరు ఓటరు ఇతర పార్టీల్లో ఉండి తమకు ఉపయోగపడతాడని భావిస్తే వారిని బీఆర్ఎస్లోకి లాగొచ్చనే ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది.
రిపోర్టుల ఆధారంగా జంపింగ్ !
రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్పార్టీలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఈ కారణంతో కూడా బీఆర్ఎస్ఎమ్మెల్యేలు మరింత త్వరపడి సర్వేలు చేయిస్తున్నారని తెలుస్తోంది. తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం నుంచి పోటీ ఎక్కువై టికెట్ రాదని తెలిస్తే సర్వేలో తేలిన బలం ఆధారంగా ఇతర పార్టీల్లోకి జంప్చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు తమకే ఇస్తారా లేదా అన్న విషయాన్ని కన్ఫమ్చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. కొన్ని రోజుల కింద మంత్రి దయాకర్రావు 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్100 సీట్లు గెలుస్తుందని కామెంట్ చేయడంతో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. దీంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు సర్వే స్పీడప్చేయాల్సిందిగా కిందిస్థాయి లీడర్లను ఆదేశిస్తున్నారు.
ముందస్తు వ్యూహం..
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ పడే ఆశావహుల సంఖ్య తక్కువేం లేదు.ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండటంతో ఇప్పటినుంచే అంతర్గత పోరు మొదలైంది. వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గ టికెట్ను కూడా సిట్టింగ్ఎమ్మెల్యే ఆరూరి రమేశ్కు కాకుండా ఇతరులకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రమేశ్కు ఎంపీ టికెట్ఇచ్చి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది.దీంతో ఎమ్మెల్యే రమేశ్ముందస్తుగా సర్వే చేయించుకుంటున్నారని, సర్వేలో తన బలం ఏమిటో అధిష్ఠానానికి తెలియజేసేందుకే ఇలా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పావు వంతు సర్వే కంప్లీట్ అయ్యిందంటున్నారు. దీంతో ఇదే దారిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నడుస్తున్నారు. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించడంతో పాటు జనం పల్స్ తెలుసుకునేందుకు సర్వే చేయిస్తున్నట్టు భావిస్తున్నారు.