కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చింది .. బుక్ లెట్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు

కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చింది .. బుక్ లెట్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలతో కూడిన బుక్​లెట్​ను బుధవారం తెలంగాణ భవన్​లో రిలీజ్ చేశారు. 

కాంగ్రెస్ లీడర్లకు వారి హామీలను గుర్తు చేసేందుకే బుక్​లెట్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ.. 420 హామీల గురించి కాంగ్రెస్​ను ప్రశ్నించాలని కోరారు. వాటి అమలు కోసం తాము కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు.