కర్ణాటక స్పీకర్ రాజీనామా

కర్ణాటక స్పీకర్ రాజీనామా

కర్ణాటక  స్పీకర్ రమేష్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.  తన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. యడియూరప్ప సర్కార్ బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కు అందజేశారు. రాజీనామా చేసిన తర్వాత రమేష్ కుమార్ భావోద్వేగంగా మాట్లాడారు. తనకు స్పీకర్ పదవి ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తన విధిని వంద శాతం నెరవేర్చానని అన్నారు. స్పీకర్ కు ఉండాల్సిన హక్కులు, నిబంధనల మేరకు నడుకున్నానని అన్నారు. తాను స్పీకర్ గా ఉన్నన్ని రోజులు ఎవరినైనా తన ప్రవర్తన వల్ల బాధ పడి ఉంటే మన్నించండి అని అన్నారు రమేష్ కుమార్.