స్టేట్​లో బీఎస్పీ విస్తరిస్తున్నది: ఆర్​ఎస్పీ

స్టేట్​లో బీఎస్పీ  విస్తరిస్తున్నది: ఆర్​ఎస్పీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బహుజన​సమాజ్​​పార్టీ (బీఎస్పీ) విస్తరిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. కార్యకర్తలు రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, దీంతో పార్టీ రోజురోజుకూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నదని అ న్నారు.

 అది చూసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు భయం పట్టుకుందని పేర్కొన్నారు. అందుకే తప్పుడు వార్తలతో బీఎస్పీపై దుష్ప్ర చారం చేయిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి చెందిన సీపీఐ, పీడీఎస్​యూ, బీసీ యువజన సంఘాల నేత లు ప్రవీణ్​ కుమార్​ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరారు. 

ఈ సందర్భంగా ప్రవీణ్​ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్​లో 30 వేల ఎకరాల భూమిని కేసీఆర్​ కుటుంబ సభ్యులు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆయన ఆరోపించారు.