హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బహుజనసమాజ్పార్టీ (బీఎస్పీ) విస్తరిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కార్యకర్తలు రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, దీంతో పార్టీ రోజురోజుకూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నదని అ న్నారు.
అది చూసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుందని పేర్కొన్నారు. అందుకే తప్పుడు వార్తలతో బీఎస్పీపై దుష్ప్ర చారం చేయిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి చెందిన సీపీఐ, పీడీఎస్యూ, బీసీ యువజన సంఘాల నేత లు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో 30 వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబ సభ్యులు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆయన ఆరోపించారు.