గిరిజనులే లేకపోతే అటవీ భూములు ఆగమవుతుండే : ఆర్ఎస్పీ

గిరిజనులే లేకపోతే అటవీ భూములు ఆగమవుతుండే : ఆర్ఎస్పీ

గిరిజనులను అటవీ దురాక్రమణదారులని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులే లేకపోతే అటవీ భూములన్నీ ఆగమవుతుండే అని అన్నారు. నిజం ముందు వంద అబద్ధాలైనా నిలబడలేవని ట్వీట్ చేశారు. ‘‘గిరిజనులను అటవీ దురాక్రమణదారులని సీఎం కేసీఆర్ దూషించడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తున్నది. వాళ్లే లేకపోతే వీటిని ఎప్పుడో అదానీ, బ్రదర్ అనీల్, గాలి జనార్ధన్ రెడ్డి, వేదాంత, మీ బినామీ కంపెనీలు, మీరు..  అసైన్డ్ భూములను గుంజుకుంటున్నట్లగా మింగెటోళ్లు’’ అని ట్వీట్ చేశారు.