లింగంపేట మండలంలోని బీటెక్ చదివాడు..సర్పంచ్ అయ్యాడు

లింగంపేట మండలంలోని  బీటెక్ చదివాడు..సర్పంచ్ అయ్యాడు

లింగంపేట, వెలుగు:  మండలంలోని బాయంపల్లి  గ్రామ పంచాయతీ సర్పంచ్​గా బాయంపల్లి తండాకు చెందిన మెగావత్​ సంతోష్ తన సమీప అభ్యర్థి కుంట ఎల్లయ్యపై 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. సంతోష్​  బీటెక్​ (మెకానికల్ ఇంజినీర్)  పూర్తి చేసి ఇంటివద్ద వ్యవసాయం చేస్తున్నాడు.  పంచాయతీ స్థానం జనరల్ రిజర్వు కావడంతో బరిలో నిలువగా 198 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి కుంట ఎల్లయ్యకు 196 ఓట్లు వచ్చాయి. మిగతా 5 ఓట్లు చెల్లకుండా పోయాయి. కేవలం 2ఓట్ల తేడాతో గొలుపొందడంపై మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.