
- మృతుడు సిద్దిపేట జిల్లా
- చాట్లపల్లి గ్రామ వాసి
జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు: పంజాబ్ లో సిద్దిపేట జిల్లాకు చెందిన స్టూడెంట్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన బరిగే భిక్షపతి కొడుకు అజయ్ (24) పంజాబ్ లోని లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజుల కింద అతడు బయటకు వెళ్తున్నానని కాలేజీ ఫ్రెండ్స్ కు చెప్పి వెళ్లాడు. అనంతరం శనివారం అజయ్ పాయిజన్ తీసుకున్నట్లు ఫ్రెండ్స్ అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు.
అజయ్ ఉన్న ప్రదేశానికి వెళ్లి చూడగా ప్రమాదకర పరిస్థితిలో కనిపించడంతో వెంటనే స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తండ్రి భిక్షపతి ఆదివారం కొడుకు డెడ్ బాడీని సొంతూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. అజయ్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.