- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క వేణుగోపాల్
శంషాబాద్, వెలుగు : ప్రతి ఒక్కరు ఓటును నమో దు చేసుకుని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క వేణుగోపాల్ సూచించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ వాంబే కాలనీలోని ప్రభుత్వ స్కూల్ ప్రాంగణం వద్ద ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 31 వరకు ఓటరు నమోదు అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడికే రాజు, మైలార్దేవ్ పల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి ధనియాల కృష్ణ, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క కృష్ణ,శంషాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షుడు బుక్క ప్రవీణ్ కుమార్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు కనకమామిడి కిట్టు ముదిరాజ్ స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.