నిజామాబాద్ లో దొంగల బీభత్సం

నిజామాబాద్ లో దొంగల బీభత్సం

నిజామాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రం ప్రధాన రహదారిపై గల వెంకటరమణ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు చోరికి పాల్పడ్డారు.

ఇంటితాళాలు పగలగొట్టి 4 తులాల బంగారు ఆభరణాలు,3 కిలోల వరకు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లరని బాధితులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.