రేవంత్ వ్యాఖ్యలపై మున్నూరుకాపుల ఆగ్రహం

 రేవంత్ వ్యాఖ్యలపై మున్నూరుకాపుల ఆగ్రహం

కరీంనగర్ టౌన్, వెలుగు: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై  టీపీసీసీ చీఫ్​రేవంత్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యలపై మున్నూరుకాపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌‌‌‌లో రేవంత్‌‌‌‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన పొన్నాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని  డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్ మాట్లాడుతూ రేవంత్‌‌‌‌రెడ్డి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్‌‌‌‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నారు. మున్నూరుకాపు సంఘం  జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, లీడర్లు రాజశేఖర్, ఏవీ రమణ, అనంతుల రమేశ్ పాల్గొన్నారు.

వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో రేవంత్‌‌‌‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.