శ్మశానంలో కెమికల్ డ్రమ్ముల కాల్చివేత...సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో ఘటన

శ్మశానంలో కెమికల్ డ్రమ్ముల కాల్చివేత...సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో ఘటన
  • పెద్ద ఎత్తున మంటలు, కమ్ముకున్న దట్టమైన పొగతో.. 
  • స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి
  • సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో ఘటన

అమీన్​పూర్​, వెలుగు :  సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట శ్మశానవాటికలో కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి కెమికల్​డ్రమ్ములు కాల్చివేశారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. ఓఆర్​ఆర్​ఎగ్జిట్​–4  సర్వీసు రోడ్డుకు పక్కనే  కిష్టారెడ్డిపేట శ్మశాన వాటికలో నుంచి మంటలు, పొగలు కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో అటువైపు నుంచి వెళ్లే వాహనదారులు భయాందోళన చెందారు.  ఏం జరుగుతుందో తెలియక కొద్ది సేపు వెహికల్స్ నిలిపేశారు. కెమికల్​ వాసనతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందడంతో  ఫైర్​ఇంజన్​తో సిబ్బంది వెళ్లి  మంటలను ఆర్పేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శ్మశాన వాటికలో కెమికల్​ డ్రమ్ములను ఎవరు నిల్వ ఉంచారు. వాటిని ఎవరు కాల్చివేశారనేది తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు.