బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా కరోనా తో మృతి ?

బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా కరోనా తో మృతి ?

బురుండీ దేశాధ్యక్షుడు ఎన్. కురుంజిజా చనిపోయారు. 55 ఏళ్ల ఆయన అనారోగ్యంతో శనివారం ఆస్పత్రిలో చేరి..ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. అయితే ఇవాళ(బుధవారం,జూన్-10) కురుంజిజా మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.

గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెబుతున్నా ఆయనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఇటీవలే కురుంజిజా భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె కెన్యాలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కురుంజిజా మృతికి కరోనాయే కారణమై ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.