తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల కొండ పై నుండి ప్రయాణికులతో కిందికి వస్తున్న బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బాస్కర సన్నిధి సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో కొద్దిసేపు బస్సు వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‭ను క్లియర్ చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.