కాలువలో పడ్డ బస్సు.. 54 మంది గల్లంతు

కాలువలో పడ్డ బస్సు.. 54 మంది గల్లంతు

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సిధి పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. సిధి నుంచి సత్నాకు 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బన్సాగర్ కాలువలో పడింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ఏడుగురిని కాపాడారు. మిగతా ప్రయాణికులంతా గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది మరియు డైవర్లు స్పాట్‌కు చేరుకున్నారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. నీటిని దిగువన ఉన్న సిహావాల్ కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఒక ప్రత్యేక బృందం అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు.

For More News..

కొడుకుపై బ్లేడ్‌తో దాడిచేసిన తల్లి

స్టూడెంట్‌పై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

ఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి