- జాన్సన్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేవారికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండదండలు అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ, ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు వీలైనంత చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు. సులువుగా వ్యాపారం చేసుకునేందుకు రూల్స్ను ఈజీ చేశామని, ఎన్నో పాలసీలు తెచ్చామని వివరించారు. అందుకే సిటీ ఇన్వెస్ట్మెంట్లకు అడ్రస్గా మారిందని కామెంట్ చేశారు. హైదరాబాద్లో మంగళవారం జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓపెన్బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించాక మంత్రి మాట్లాడుతూ.. మనదేశంలో తగినంత టాలెంట్ ఉందని అన్నారు.
మాన్యుఫ్యాక్చరింగ్ అడ్డాగా హైదరాబాద్..
‘‘కంపెనీలు పెట్టుబడుల కోసం దేశంలోని మరే రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదు. మేం వాటికి అన్ని విధాలా అండదండలను అందిస్తున్నాం. జాన్సన్ సంస్థ పదేళ్లుగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆపరేషన్స్ను విస్తరించడం సంతోషకరమైన విషయం. హైదరాబాద్ ఎంతలా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో సంస్థలకు బాగా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ-హబ్, టీ-సెల్ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇమేజ్ టవర్స్, ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నాం. మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారబోతున్నది”అని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ కంట్రోల్స్ గ్లోబల్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్ డేవ్ పుల్లింగ్ , జాన్సన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ గ్లోబల్ వీపీ గోపాల్ పారిపల్లి, జాన్సన్ కంట్రోల్స్ ఇంట్రూజన్ ప్రొడక్ట్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్, తజ్మిన్ పిరానీ పాల్గొన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్దనున్న గౌర ఫౌంటెన్హెడ్ వద్ద ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు.