బ్యాంకాక్: ఇండియా స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బుధవారం మొదలయ్యే ఈ టోర్నీలో తనదైన దూకుడుతో సత్తా చాటాలని ఆశిస్తున్నాడు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు గాయం వల్ల ఈ టోర్నీకి దూరం అవ్వడంతో ఇండియా నుంచి ప్రణయ్ ఒక్కడే బరిలో నిలిచాడు.
ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ఒలింపిక్ చాంప్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్), కొడై నరావొక (జపాన్), లు గ్వాంగ్ జు (చైనా)తో కూడిన గ్రూప్-–ఎలో కఠిన సవాల్ ఎదుర్కోబోతున్నాడు. తొలి మ్యాచ్లో నరావొకతో పోటీ పడనున్నాడు. తొలుత సెమీస్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రణయ్ గ్రూప్ దశలో మూడింటిలో రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది.