నేటి నుంచి బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్​ ఫైనల్స్​

నేటి నుంచి బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్​ ఫైనల్స్​

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బుధవారం మొదలయ్యే ఈ టోర్నీలో తనదైన దూకుడుతో సత్తా చాటాలని ఆశిస్తున్నాడు. డబుల్ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు గాయం వల్ల ఈ టోర్నీకి దూరం అవ్వడంతో ఇండియా నుంచి ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కడే బరిలో నిలిచాడు. 

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలకడగా ఆడుతున్న అతను  ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్సెల్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కొడై నరావొక (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), లు గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జు (చైనా)తో కూడిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–ఎలో కఠిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుర్కోబోతున్నాడు. తొలి మ్యాచ్​లో నరావొకతో పోటీ పడనున్నాడు. తొలుత సెమీస్​ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రణయ్​ గ్రూప్​ దశలో మూడింటిలో రెండు మ్యాచ్​లు గెలవాల్సి ఉంటుంది.