కానిస్టేబుళ్ల నుంచి తప్పించుకోబోయి ఎస్ఐని ఢీకొట్టారు

కానిస్టేబుళ్ల నుంచి తప్పించుకోబోయి ఎస్ఐని ఢీకొట్టారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న కానిస్టేబుళ్లను చూసి.. తప్పించుకునేందుకు తమ బైకును టర్న్ తీసుకుంటే నేరుగా ఎస్.ఐ మధుప్రసాద్ ను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి వద్ద జరిగిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. సబ్ ఇన్స్ పెక్టర్ మధు ప్రసాద్ పర్యవేక్షణలో కానిస్టేబుళ్లు రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో బైకుపై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసుల నుంచి తప్పించుకోబోయి తమ వాహనాన్ని సడన్ గా టర్న్ తీసుకున్నారు. అక్కడ ఎస్.ఐ మధుప్రసాద్ ను గుర్తించిన వాహనదారులు బ్రేక్ వేసేలోపే నేరుగా వెళ్లి ఎస్ ఐ  మధు ప్రసాద్ ని ఢీకొట్టి ఆగిపోయారు. హఠాత్తుగా జరిగిన ఘటన తనిఖీలు చేస్తున్న పోలీసులనే కాదు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. గాయపడిన ఎస్ఐను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

for more News..

కార్యకర్తలు పేదలకు అండగా నిలవాలి

రూ. కోట్లు దండుకొని.. చుక్క నీరు కూడా తేలేకపోయారు

ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చారు.. వాళ్లు మాత్రం పస్తులుంటున్నారు

బాల సాహితీవేత్త వాసాల నరసయ్య కన్నుమూత