21 డేస్ లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం క్లారిటీ

21 డేస్ లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం క్లారిటీ

కరోనా కట్టడికి విధించిన 21 రోజుల లాక్ డౌన్  పొడిగింపుపై  క్లారిటీ ఇచ్చింది  కేంద్రం. లాక్ డౌన్ ను పొడిగించే ఆలోచన లేదని.. అలాంటి వార్తలను నమ్మొద్దని కేంద్ర కేబినెట్ సెక్రటరీ  రాజీవ్ గౌబా చెప్పారు. లాక్ డౌన్ ను పొడిగించాలని మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని సూచించారు. లాక్ డౌన్ పొడిగింపు వస్తున్న వార్తలు విని  ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. అసలు అలాంటి ఆలోచనే లేదన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారత్ లో నూ వ్యాపిస్తుండటంతో ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ కు పిలుపునిచ్చారు. అయినా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే లాక్ డౌన్ సమయాన్ని పెంచుతారని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ గౌబా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు భారత్ లో  1190 పాజిటివ్ కేసులు నమోదు కాగా..29 మంది చనిపోయారు.