రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయండి

రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయండి
  • సీఎస్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు సెంట్రల్ కేబినెట్ కార్యదర్శి ఆదేశం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాల సీఎస్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎలా అమలవుతోందన్న దానిపై ఆదివారం సీఎస్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణకు పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న మెగ్రెంట్ లేబర్స్ ను వారి స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. విదేశాల్లో ఉన్న మన దేశీయులను తీసుకొచ్చే అంశంపైన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రాల సీఎస్ లు ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొ్న్నారు.