రాష్ట్రాలు అప్పులపై జాగ్రత్తగా వ్యవహరించాలి

రాష్ట్రాలు అప్పులపై జాగ్రత్తగా వ్యవహరించాలి
  • అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలె
  • రాష్ట్రాలకు కేంద్రం సూచన

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రాలు అప్పులపై జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ, కాగ్​ మరోమారు హెచ్చరించాయి. ముంబైలో గురువారం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ సెక్రటరీల సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, అప్పులు, క్యాష్​ మేనేజ్​మెంట్​ ఇతర అంశాలు చర్చించారు. అప్పుల విషయంలో ప్లానింగ్​ ఉండాలని ఆర్బీఐ గవర్నర్​ రాష్ట్రాల సెక్రటరీలకు సూచించారు. పద్ధతిగా ఖర్చులు చేయడం, రాష్ట్రాల మార్కెట్​ రుణాలు, గ్యారంటీ రిడెంప్షన్​ ఫండ్​పై మీటింగ్​లో చర్చించారు.