శర్మిష్ట పనోలికి బెయిల్ మంజూరు చేసిన కోల్​కతా హైకోర్టు

శర్మిష్ట పనోలికి బెయిల్ మంజూరు చేసిన కోల్​కతా హైకోర్టు

కోల్​కతా: సోషల్‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌ప్లూయెన్సర్ శర్మిష్ట పనోలి(22)కి ఊరట లభించింది. ఆమెకు కోల్ కతా హైకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శర్మిష్ట పనోలి సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ గా పేరు సాధించారు. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌’పై బాలీవుడ్‌‌‌‌ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న ఆమె పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదమై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన పోస్టులు, రీల్స్ తొలగించి ఆమె క్షమాపణలు చెప్పారు. శర్మిష్టపై వజాహత్ ఖాన్ ఖాద్రీ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కోల్ కతా పోలీసులు గురుగ్రామ్ లో మే 31న ఆమెను అరెస్టు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పెను రాజకీయ దుమారం రేగింది.