ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం

ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ ​నేతలు సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 14,15 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ సర్కార్​ఆరు గ్యారంటీలను వివరించారు. వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండస్ట్రీలను​తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ టౌన్ ​ప్రెసిడెంట్ పల్లె రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్ ​జంగం కళ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, సీనియర్ లీడర్ ​ఎండీ అబ్దుల్​ అజీజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, లీడర్లు పలిగిరి కనకరాజు, పూల్లూరి కళ్యాణ్, కనకం వెంకటేశ్వర్లు, అఫ్జల్​లాడెన్ తదితరులు​ పాల్గొన్నారు.