కుర్రాళ్ల డామినేషన్.. సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ గిల్, జైస్వాల్.. తొలిరోజు ఇండియాదే ఆధిపత్యం..

కుర్రాళ్ల డామినేషన్.. సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ గిల్, జైస్వాల్.. తొలిరోజు ఇండియాదే ఆధిపత్యం..

లీడ్స్‌‌‌‌‌‌‌‌: లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత బరిలోకి దిగిన తొలి పోరులోనే కుర్రాళ్లు శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (175 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 16 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 124 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), యశస్వి జైస్వాల్ (159 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 16 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 101)  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గడ్డపై సెంచరీలతో దుమ్మురేపారు. రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ ఘన వారసత్వాన్ని కొనసాగించే సత్తా తమకే ఉందని నిరూపించారు. 

ఈ ఇద్దరి ఖతర్నాక్ ఆటతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం మొదలైన తొలి టెస్టును ఇండియా అద్భుతంగా ఆరంభించింది. మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన టీమిండియా85 ఓవర్లలో 359/3 చేసి భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (42) ఆకట్టుకోగా.. గిల్‌‌‌‌‌‌‌‌కు తోడుగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్  (102 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీతో క్రీజులో ఉన్నాడు. 

రోజంతా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ మూడు వికెట్లు మాత్రమే పడగొట్టింది.  ఇండియా ఇదే జోరును రెండో రోజు కూడా కొనసాగించి 500 రన్స్‌‌‌‌‌‌‌‌ సాధిస్తే   మళ్లీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చే అవకాశం రాకపోవచ్చు.

ఓపెనర్ల పునాది

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు మంచి పునాది వేశారు. బాల్ కొద్దిగా స్వింగ్‌‌‌‌‌‌‌‌ అవుతున్నప్పటికీ వికెట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించింది.  క్రిస్ వోక్స్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మిడాఫ్ మీదుగా అద్భుతమైన డ్రైవ్‌‌‌‌‌‌‌‌తో జైస్వాల్‌‌‌‌‌‌‌‌ ఆట ప్రారంభించాడు. రాహుల్ కూడా బ్రైడన్  కార్సీ, జోష్ టంగ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కవర్స్ మీదుగా క్లాసిక్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లు ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లు వీళ్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. 

దాంతో తొలి సెషన్‌‌‌‌‌‌‌‌లోనే ఓపెనర్లు 16 ఫోర్లు రాబట్టారు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ లయన్స్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరిచిన యంగ్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైస్వాల్‌‌‌‌‌‌‌‌ ప్రధాన పోరులో మాత్రం  తడాఖా చూపెట్టాడు. నాణ్యమైన షాట్లతో బాల్‌‌‌‌‌‌‌‌ను బౌండ్రీకి చేర్చాడు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత తిరిగి ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన  రాహుల్ మంచి టైమింగ్‌‌‌‌‌‌‌‌, టెక్నిక్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. దాంతో తొలి సెషన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పూర్తి పైచేయి సాధించేలా కనిపించింది.

 కానీ, లంచ్ ముందు కార్సీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రాహుల్  స్లిప్‌‌‌‌‌‌‌‌లో రూట్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అరంగేట్రం బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయి సుదర్శన్ (0) తర్వాతి ఓవర్లోనే స్టోక్స్ లెగ్ సైడ్ బాల్‌‌‌‌‌‌‌‌ను వెంటాడి కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో 92/2తో ఇండియా తొలి సెషన్‌‌‌‌‌‌‌‌ను ముగించింది.

జైస్వాల్–గిల్ జోరు

సెకండ్ సెషన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పూర్తి పైచేయి సాధించింది. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే జైస్వాల్ జోరు కొనసాగించగా.. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన గిల్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్ ఆడాడు. సాధారణంగా వేగంగా ఆడే జైస్వాల్ ఈసారి సంయమనం పాటిస్తూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ముఖ్యంగా ఔట్‌‌‌‌‌‌‌‌ సైడ్ ఆఫ్-స్టంప్ బాల్స్‌‌‌‌‌‌‌‌ చాలా జాగ్రత్తగా ఆడాడు. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో పదునైన షాట్లతో ఆకట్టుకున్నాడు. 

పేసర్ టంగ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఆఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌ ఫోర్‌‌, సిక్స్‌‌‌‌‌‌‌‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు.  ఇంకోవైపు గిల్ తనదైన స్టయిల్లో వేగంగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆన్-సైడ్‌‌‌‌‌‌‌‌, ఆఫ్-సైడ్‌‌‌‌‌‌‌‌లో చూడ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు కార్సీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన జైస్వాల్ ఆ తర్వాత సింగిల్‌‌‌‌‌‌‌‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఆనందంలో గట్టిగా అరిచి గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు. ఇంకోఎండ్‌‌‌‌‌‌‌‌లో గిల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా ఇండియా 215/2తో టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. రెండో సెషన్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 123 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టిన గిల్ సేన మూడో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ హవా కొనసాగించింది. 

టీ నుంచి వచ్చిన వెంటనే జైస్వాల్‌‌‌‌‌‌‌‌ను స్టోక్స్ ఔట్ చేసినా.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తోడుగా కెప్టెన్ గిల్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను నడిపించాడు. శుభ్‌‌‌‌‌‌‌‌మన్ తన ధాటిని కొనసాగించగా.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన పంత్‌‌‌‌‌‌‌‌ పక్కా టెస్టు ఆటతో అతనికి సపోర్ట్ ఇచ్చాడు. మరో లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ –రైట్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను విడదీసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చాలా ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వలేదు. 

ఈ క్రమంలో చూస్తుండగానే స్కోరు 300 దాటగా.. గిల్ 140 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే సెంచరీ అందుకున్నాడు. పంత్ 91 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ మార్కు దాటాడు.  కొత్త బాల్‌‌‌‌తో ఐదు ఓవర్లు వేసినా ఇంగ్లండ్ ఈ జోడీని విడదీయలేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్:  85 ఓవర్లలో 359/3    ( గిల్ 127 బ్యాటింగ్‌‌‌‌  , జైస్వాల్ 101, పంత్ 65 బ్యాటింగ్‌‌‌‌, స్టోక్స్ 2/43) 

    
అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు నల్ల ఆర్మ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్‌‌‌‌‌‌‌‌లు ధరించారు.ఆట ఆరంభానికి ముందు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఒక నిమిషం మౌనం పాటించారు.
    
ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం చేశాడు. ఇండియా 317వ నంబర్ టెస్టు క్యాప్‌‌‌‌‌‌‌‌ను  సుదర్శన్‌‌‌‌‌‌‌‌కు చతేశ్వర్ పుజారా అందజేశాడు. ఇంకోవైపు 2017లో చివరి టెస్టు ఆడిన కరుణ్ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనిమిదేండ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.