పొగమంచు ఎఫెక్ట్ .. చెరువులోకి దూసుకెళ్లిన కారు

పొగమంచు ఎఫెక్ట్ ..  చెరువులోకి దూసుకెళ్లిన కారు

వికారాబాద్, వెలుగు:  పొగమంచు కారణంగా కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్​జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కారు(ఏపీ 37ఏటీ5000)లో ఐదుగురు వ్యక్తులు అనంతగిరి గుట్టకు బయలుదేరారు. పొగమంచు ఎక్కువ ఉండడంతో రోడ్డుపై ఏమీ కనిపించక కారు అదుపుతప్పి.. వికారాబాద్​సమీపంలోని శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లింది. 

కారులో నుంచి మదాల మోహన్, రఘు కోమర, సాగర్​ కోమర, పూజిత సురక్షితంగా బయటపడగా.. గుణశేఖర్(24)  గల్లంతయ్యాడు. రెస్క్యూ టీమ్ 11 గంటల పాటు శ్రమించి గుణశేఖర్​మృతదేహాన్ని బయటకు తీసింది. ప్రమాదం జరిగిన టైమ్ లో కారును మోహన్​నడుపుతున్నట్టు వికారాబాద్ సీఐ టంగుటూరు శ్రీను తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఘటనా స్థలాన్ని స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్, వికారాబాద్​ జిల్లా పరిషత్​చైర్​పర్సన్​పట్నం సునీతా మహేందర్​రెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్​ మంజుల రమేశ్ పరిశీలించారు.