
కరోనా ఎఫెక్ట్ పౌల్ట్రీ ఫామ్స్ పై పడటంతో నల్గొండలో ఓ వ్యాపారి వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. వంద రూపాయలకే రెండు కోళ్లను అమ్ముతున్నాడు. కరోనా వైరస్ తో ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమకు నష్టాలొస్తున్నాయి. దీంతో కోళ్లు తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పేందుకే వందకే రెండు కోళ్లను అమ్ముతున్నాడు. ఈ రెండు కోళ్లు దాదాపు 4 కిలోల బరువు వున్నాయి. అంటే ఒక కిలో కోడి మాంసం 25రూపాయలకే వస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యాపారి కోరుతున్నాడు.