మారుతి కార్లకే జనం ఓటు

మారుతి కార్లకే జనం ఓటు

హైదరాబాద్, వెలుగు :  పాత కార్లు కొనాలనుకునే నగరవాసుల్లో ఎక్కువ మంది మారుతి బ్రాండ్​ను ఇష్టపడుతున్నారని, తరువాత స్థానంలో రెనో క్విడ్, హుండై ఐ10లు ఉన్నాయని ఆటోటెక్ కంపెనీ కార్స్​24 తెలిపింది. ఎక్కువ మైలేజ్​, ఎక్కువ సర్వీసింగ్​ సెంటర్లు, రీసేల్​వాల్యూ బాగుండటం వల్ల మారుతివైపు మొగ్గుచూపుతున్నారని వెల్లడించింది.   ‘‘స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఆల్టో,  బాలెనోలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ లో పాత కార్ల విక్రయాల అమ్మకాలు వార్షికంగా 156 శాతం పెరిగాయి. పాత కార్ల కొనుగోలుదార్లలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. 

తెలంగాణ కార్ల కొనుగోలుదారులు మైలేజీని అన్నింటికంటే ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. హైదరాబాద్​లో మాకు 4 అవుట్​లెట్లు ఉన్నాయి. త్వరలో విజయవాడలో మరొక దానిని ప్రారంభిస్తాం. జీరో డౌన్​పేమెంట్​తో ఫైనాన్స్​ ఇస్తున్నాం.  ఈసారి ఫెస్టివల్​ సీజన్​ అమ్మకాలు భారీగా ఉంటాయని భావిస్తున్నాం.   హైదరాబాద్ ప్రజలు జూన్ క్వార్టర్​లో రూ. 103  కోట్ల విలువైన కార్లను అమ్మారు” అని  కార్స్​24 కో–-ఫౌండర్​గజేంద్ర జంగిద్ వివరించారు.