పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేణుకా చౌదరిపై కేసు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేణుకా చౌదరిపై కేసు

కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిపై కేసు నమోదైంది. రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా ఎస్సైపై దురసుగా ప్రవర్తించడంతో ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన పోలీసులు రేణుకా చౌదరిపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదుచేశారు. పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధి నిర్వాహణకు ఆటంకం కలిగించినందుకు కేసు బుక్ చేసినట్లు చెప్పారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ సీనియర్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకను మహిళా పోలీసులు చుట్టుముట్టడంతో ఆగ్రహించిన ఆమె.. ఎస్ఐ కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చింది.