కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పీఏపై కేసు .. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని రూ.లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పీఏపై కేసు .. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని రూ.లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు
  • ఆలస్యంగా వెలుగులోకి..నేడు ఫిర్యాదు చేయనున్న మరికొందరు

జీడిమెట్ల, వెలుగు: డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు ఇప్పిస్తానని మోసం చేశాడంటూ కుత్బుల్లాపూర్​ఎమ్మెల్యే వివేకానంద​ పీఏపై కేసు నమోదైంది. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... బొమ్మిడిశెట్టి హరిబాబు కుత్బుల్లాపూర్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వివేకానంద ప్రైవేట్​ పీఏ. 2023లో కుత్బుల్లాపూర్​ గిరినగర్ కు చెందిన తైలం రమేశ్​డబుల్​బెడ్​ రూమ్ ఇంటి​ కోసం ఎమ్మెల్యే ఆఫీస్​కు వెళ్లాడు. పీఏ హరిబాబు అతనికి  ఇల్లు ఇప్పిస్తానని నమ్మంచి, రూ.లక్ష తీసుకున్నాడు. 

తర్వాత మరోసారి ఎమ్మెల్యే ఆఫీస్​కు వెళ్లగా హరిబాబు మరో 83 మంది వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేసి, ఆ డబ్బులతో భూమిరెడ్డి నగర్ లో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిసింది. డబ్బుల గురించి అడగడానికి రమేశ్ ​ప్రయత్నించినా అతను స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి, ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

మరో అనుచరుడిపై ఫిర్యాదుకు రెడీ..

ఎమ్మెల్యే  వివేకానంద పీఏ హరిబాబుపై ఇప్పటికే  కేసు నమోదవగా ఆయన మరో అనుచరుడు శ్రీధర్ సైతం డబుల్​ బెడ్​ రూమ్ ​ఇండ్లు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పూర్తి ఆధారాలతో రావాలని సూచించారు. దీంతో బుధవారం ఫిర్యాదు చేయడానికి రెడీ 
అవుతున్నారు.   

ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై విచారణ జరపాలి 

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కుత్బుల్లాపూర్​నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద, ఆయన అనుచరులు చేసిన అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా స్పోక్స్ పర్సన్ నల్లా జయశంకర్​డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ భూముల కబ్జా, చెరువుల ఆక్రమణలు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారని 
ఆరోపించారు.