రాజాసింగ్పై కేసు నమోదుచేసిన మంగళ్హాట్ పోలీసులు

రాజాసింగ్పై కేసు నమోదుచేసిన మంగళ్హాట్ పోలీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. ట్విట్టర్లో వివాదాస్పద పోస్ట్ చేశారంటూ మంగళవారం పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ట్వీట్పై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాజాసింగ్ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంగళ్ హాట్ పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 295ఏ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 

ఈ నెల 6న అయోధ్య, అక్బర్పై రాజాసింగ్ రెండు ట్వీట్లు చేశారు. వాటిని పరిశీలించిన మంగళహాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పీడీ యాక్ట్ కొట్టేసిన సందర్భంలో హైకోర్టు విధించిన షరతులు రాజా సింగ్ ఉల్లంఘించారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దానికి రాజాసింగ్ తన న్యాయవాది ద్వారా వివరణ ఇవ్వగా.. మంగళ్ హాట్ పోలీసులు దానిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వివరణతో సంతృప్తి చెందనందున ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.