ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆదిలాబాద్జిల్లా నార్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామ సర్పంచ్అభ్యర్థి ఆర్.మధుకర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ అంజమ్మ తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు మంగళవారం నాటికే అక్కడ ప్రచారం ముగియగా.. నిబంధనలకు విరుద్ధంగా బుధవారం తన ఇంటి ఆవరణలో 50 మందితో కలిసి మధుకర్ ప్రచారం నిర్వహించారు.
సమాచారం అందుకున్న ఎఫ్ఎస్టీ టీమ్తనిఖీలు చేసింది. ఎఫ్ఎస్టీ సభ్యుల ఫిర్యాదు మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేయొద్దని, డబ్బులు, మద్యం, బహుమతులు పంచడం చట్టరీత్యా నేరమని వెల్లడించారు.

