సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. పంజాగుట్ట పీఎస్ లో SIB అడిషనల్ DSP కంప్లైట్ తో ..ప్రణీత్ రావు సహా మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. అటు ప్రణీత్ రావుపై IPC 420, 427,201, 120 బీ సెక్షన్ లతోపాటు PDPP యాక్ట్, ఐటీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

SIB ఆఫీస్ లో హార్డ్ డిస్కులతోపాటు కంప్యూటర్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని సమాచారం సేకరించినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు... ఎలక్షన్ రిజల్ట్ తో సేకరించిన సమాచారాన్ని హార్డ్ డిస్క్ లోకి మార్చినట్లు తేల్చారు.

ALSO READ :- IPL 2024: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్