
లింగంపేట, వెలుగు : గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తున్న నరేందర్,హేంసింగ్, అంజయ్య, ఆంజనేయులు అనే పీఎంపీ వైద్యులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అర్హతకు మించి ఇంజక్షన్లు చేయడం, రోగులకు మంచాలు ఏర్పాటు చేసి వైద్యం చేయడం, సెలైన్లు ఎక్కించడం చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్సు అధికారి రాకేశ్తో కలిసి బుధవారం ప్రథమ చికిత్స సెంటర్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు పీఎంపీ వైద్యులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సైపేర్కొన్నారు.