ఇథనాల్​ కంపెనీ రద్దు చేయాలి : కుల నిర్మూలన పోరాట సమితి

ఇథనాల్​ కంపెనీ రద్దు చేయాలి : కుల నిర్మూలన పోరాట సమితి

మరికల్, వెలుగు: ఇథనాల్​ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్​  డిమాండ్​ చేశారు. శనివారం మండలంలోని ఎక్లాస్​పూర్​ స్టేజీ వద్ద ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలంటూ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్వర్యంలో రిలే నిరహర దీక్షలు ప్రారంభించారు. ప్రజాభిప్రాయం లేకుండా కంపెనీ పనులు ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నీటిని, ఆహార ధాన్యాలను ఉపయోగిస్తే ఇక్కడి జనానికి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. 

ప్రజలు అనారోగ్యం పాలవడమే కాకుండా పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటుతో జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ఏడాదిగా ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. చక్రవర్తి, బండారి మల్లేశ్, నాగమ్మ, చంద్రమ్మ, శివలింగమ్మ, సుదర్శన్, నాగేశ్, యాదగిరి పాల్గొన్నారు.