
- ప్రజారోగ్యం దృష్ట్యా మరో చోటుకు తరలించాలి
- అధికారులకు ఓ అపార్ట్ మెంట్ వాసుల కంప్లయింట్
పద్మారావునగర్, వెలుగు: కమర్షియల్కిచెన్కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని బోయిగూడ వై జంక్షన్లోని ఎంఎన్కే విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్ వాసులు కలెక్టర్, బల్దియా కమిషనర్, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులకు బుధవారం లేఖ ద్వారా కంప్లయింట్ చేశారు. తమ అపార్ట్ మెంట్ పక్కనే కేటరర్స్ కిచెన్లో ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వంట పాత్రల చప్పుళ్లు, నూనెల పొగ, ఎగ్జాస్ట్ ఫ్యాన్లతో నూనె ఆవిరి, వాసనలతో శ్వాస పీల్చుకోలేకపోతున్నామని అపార్ట్ మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డంగా పేర్చిన గ్యాస్ సిలిండర్లతో కూడా ప్రమాద ముప్పు ఉందని పేర్కొన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా నివాసిత ప్రాంతం నుంచి కేటరర్స్ కిచెన్ ను మరో చోటికి తరలించాలని అధికారులను కోరారు.